Odisha: మొన్నే పెళ్లైంది అప్పుడే బతుకు ముగిసింది.. రోడ్డు ప్రమాదంలో..

Odisha: మొన్నే పెళ్లైంది అప్పుడే బతుకు ముగిసింది.. రోడ్డు ప్రమాదంలో..
Odisha: ఒకరికి ఒకరు తోడై జీవితపు మధురిమలను ఆస్వాదించాలనుకున్నారు.. అంతలోనే దేవుడు వారిని చిన్న చూపు చూశాడు.. రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

Odisha: ఒకరికి ఒకరు తోడై జీవితపు మధురిమలను ఆస్వాదించాలనుకున్నారు.. అంతలోనే దేవుడు వారిని చిన్న చూపు చూశాడు.. రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలోని గంజాం జిల్లాలో సోమవారం సాయంత్రం జరిగిన దారుణ ఘటనలో నూతన వధూవరులు ప్రాణాలు కోల్పోయారు. గోల్‌తార పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మృతుల గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. నివేదికల ప్రకారం, వీరికి ఫిబ్రవరి 10 న వివాహం జరిగింది. బైక్‌పై బెర్హంపూర్‌కు వస్తుండగా గోల్‌తార పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఎదురుగా వేగంగా వస్తున్న ట్రాక్టర్‌ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో యువకుడికి, అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిని ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న గోలాంతర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story