UP : యూపీలో విషాదం.. సిలిండర్ పేలి నలుగురు మృతి
యూపీలో (UP) విషాదం చోటు చేసుకుంది. దేవరియా(D) డుమ్రిలో ఓ ఇంట్లో సిలిండర్ పేలి తల్లితో సహా ముగ్గురు చిన్నారులు మరణించారు. చాయ్ పెడుతున్న సమయంలో గ్యాస్ లీకై సిలిండర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులుగ్రామస్థుల సహాయంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఉదయం నిద్ర లేవగానే భర్త, పిల్లలకు టీ పెట్టడం కోసం ఆర్తి స్టవ్పై టీ పాన్ పెట్టి గ్యాస్ వెలిగించగానే మంటలు చెలరేగి సిలిండర్ పేలింది. ఈ సమయంలో గదిలో నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులు ఆంచల్ (14), కుందన్ (12), సృష్టి (11) మంటల్లో చిక్కుకున్నారు. మంటలు గదిలోకి వేగంగా వ్యాపించడంతో ఎవరూ బయటకు వచ్చే అవకాశం లేదు. మంటలు అదుపులోకి వచ్చేలోపే మహిళ, చిన్నారులు తీవ్రంగా కాలిపోయారు. ఘటనా స్థలంలో గందరగోళ వాతావరణం నెలకొంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com