Affair : నటి ఐశ్వర్య .. 25 లక్షలు కాజేసి వేరొకరితో అఫైర్

Affair : నటి ఐశ్వర్య ..  25 లక్షలు కాజేసి వేరొకరితో అఫైర్

అత్తారింటికి దారేది సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తనను మోసం చేసిందని ఆమె భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ మీడియాను ఆశ్రయించాడు. పెళ్లయిన తర్వాత పాతిక లక్షలు కాజేసి విడాకులు కోరుతూ తనను.. తన తల్లి దండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించాడు. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతోందని, తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. . పెళ్లయిన నెల రోజులకే ఐశ్వర్య అఫైర్ గురించి తనకు తెలిసి నిలదీస్తే తనపైనే ఎదురుదాడి చేసిందని వాపోయాడు.

2023 సెప్టెంబర్ 6న పిన్నింటి శ్యామ్ కుమార్, అడ్డాల ఐశ్వర్య పెళ్లి చేసుకున్నారు. ‘కాపు మ్యాట్రిమొనీ’ ద్వారా సీరియల్ నటి అయిన ఐశ్వర్యని శ్యామ్ కుమార్ వివాహమాడారు. జీ తెలుగు, మా టీవీ, ఈటీవీ, జెమినీ టీవీ.. పలు ఛానల్లో ప్రసారమయ్యే టీవీ సీరియల్‌లలో ఐశ్వర్య నటిస్తున్నారు. అమ్మాయి గారు, పలుకే బంగారామాయేనా, అలా వైకుంఠపురం, అత్తారింటికి దారేది సీరియల్‌లలో ఆమె నటిస్తున్నారు. పలు సినిమాల్లో కూడా ఐశ్వర్య నటించారు.

Tags

Read MoreRead Less
Next Story