Suicide : భర్తతో గొడవ.. పుస్తెలతాడుతో ఉరేసుకున్న భార్య
భర్త మందలించడంతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు, అల్వాల్ పోలీసులు తెలిపిన ప్రకారం... ఖానాజీగూడ టెలికమ్ కాలనీలో సాయికుమార్, అనూష(29) దంపతులు నివసిస్తున్నారు. సోమవారం ఉదయం పిల్లలకు సమయానికి మందులు ఇవ్వలేదని భార్యను భర్త మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనూష భర్త ఇంట్లో లేనప్పుడు బాత్రూంలోకి వెళ్లి డోర్ వేసుకుంది.
అనూష అత్త ఎంత కొట్టినా డోర్ తీయకపోయేసరికి తన కొడుకుకు చెప్పింది. అతను వచ్చి డోర్ ఓపెన్ చేసి చూడగా అనూష తన పుస్తెలతాడుతో ఉరేసుకుని కనిపించింది. ఆమెను వెంటనే 108లో లోతుకుంటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. అనూష తల్లి జయమ్మ ఫిర్యాదుతో అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి.. డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com