Dead : ప్రియురాలి ఇంట్లోనే శవమైన బాలుడు

Dead : ప్రియురాలి ఇంట్లోనే శవమైన బాలుడు

వారిద్దరూ మైనర్లే..తెలిసీ తెలియని వయసులో ప్రేమించుకున్నారు. విషయం పెండ్లి దాకా వెళ్లింది. ఊరిలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టగా వయసు వచ్చాక పెండ్లి చేస్తామని నచ్చజెప్పారు. ఇంతలో బాలికను ప్రేమించిన బాలుడు ఆ అమ్మాయి ఇంట్లోనే శవమై కనిపించాడు. పోలీసుల కథనం ప్రకారం...కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఈస్ గాం పోలీస్​స్టేషన్​ పరిధిలోని నామానగర్​కు చెందిన మేడి సత్యం, సుజాత దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.

పెద్దవాడైన సాయి కిరణ్(17) ఎనిమిదో తరగతి వరకు చదివి మానేశాడు. సమీపంలోనే ఉండే ఓ మైనర్ ​బాలికతో ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం ఆ బాలిక పదో తరగతి చదువుతోంది. వీరి ప్రేమ గురించి తెలియడంతో పెండ్లి చేద్దామని ఇరు కుటుంబాలు అనుకున్నాయి. అయితే, మైనర్లు కావడంతో రెండు రోజుల కింద పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఇద్దరికీ వయసు నిండిన తర్వాతే పెండ్లి చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా.. సాయికుమార్ తమ ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని సోమవారం ఉదయం బాలిక తండ్రి బాలుడి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చాడు. సాయి మెడ దగ్గర గాట్లు ఉండడంతో ఉరి వేసి చంపారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని రూరల్ సీఐ నాగరాజు, ఎస్ఐ రామన్ కుమార్ పరిశీలించారు. పోస్ట్ మార్టం తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని సీఐ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story