Tips : టైమ్‌కు తినండి.. పేగు అల్సర్ వస్తోంది జాగ్రత్త!

Tips : టైమ్‌కు తినండి.. పేగు అల్సర్ వస్తోంది జాగ్రత్త!

పని ఎప్పుడూ ఉంటుంది.. టైం కు తినండి.. టైంకు చేయాల్సినవి చేయండి. అప్పుడే ఈ రోజుల్లో మీ ఆరోగ్యాన్ని పది కాలాల పాటు కాపాడుకోగలరు. చెప్పడానికి సింపుల్ గా ఉన్నా.. ఇదిపక్కాగా పాటించాలంటున్నారు డాక్టర్లు.

పెప్టిక్ అల్సర్ ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య. ఆహారం టైంకు తీసుకోని మనిషి పేగులను ప్రభావితం చేస్తుందిది. ఆహారం తినేవారిలో, మసాలా ఆహారం తినేవారిలో లేదా అతిగా నూనె, కారం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కడుపులో మందపాటి ద్రవ రూపంలో శ్లేష్మం యొక్క మృదువైన పొర ఉంటుంది. ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్ నుండి కడుపు లోపలి పొరను రక్షిస్తుంది. ఈ యాసిడ్ సరైన జీర్ణక్రియకు పనిచేస్తుంది. కానీ.. కొన్ని పరిస్థితుల్లో ఇది శరీర కణజాలాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఓ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు కడుపులో అల్సర్లు ఏర్పడతాయి.

దీనికి ప్రాపర్ ట్రీట్ మెంట్ అవసరం. కడుపు పూతల నివారించడానికి, తేలికపాటి ఆహారం తినడానికి ప్రయత్నించండి. కారంగా, వేయించిన ఆహారాన్ని నివారించాలి. మెంతికూరలో ఉండే ప్రొటీన్ , నికోటినిక్ గుణాలు పొట్టలో పుండ్లకు చికిత్స చేయడంలో సహాయపడతాయి. ఉసిరి జామ్ కడుపు పూతల నయం చేయడంలో ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. సోపు పొట్టకు చాలా మంచిది. ఈ వ్యాధిని నయం చేయడానికి, ప్రతిరోజూ సోపు నీటిని త్రాగాలి. పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కూడా మంచిది.

Tags

Read MoreRead Less
Next Story