భారత్లో 60 లక్షలకు చేరువలో కరోనా కేసులు
By - shanmukha |26 Sep 2020 5:22 AM GMT
దేశంలో కరోనా ఉద్రిక్తత కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 85,362 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
దేశంలో కరోనా ఉద్రిక్తత కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 85,362 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 59,03,933కి చేరింది. అటు కరోనా మరణాలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతీ రోజు వెయ్యికిపైగా నమోదవుతున్నాయి. తాజాగా, 1089 మంది కరోనా కాటుకి బలైయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా మృతులు 93,379కి పెరిగారు. మొత్తం కేసుల్లో 48,49,585 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 9,60,969 మంది చికిత్స పొందుతున్నారు. అయితే, ఇటీవల ప్రతీరోజు నమోదవుతున్న కేసుల కంటే రికవరీ అవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నాయి. ఇది కాస్తా ఉపశమనం కలిగిస్తుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com