రామాయణం, భారతం కల్పితమన్న స్కూల్ టీచర్.. తర్వాత ఏం జరిగిందంటే..

రామాయణం, భారతం కల్పితమన్న స్కూల్ టీచర్.. తర్వాత ఏం జరిగిందంటే..

విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్.. వివాదాస్పద పాఠాలు చెబితే శిక్ష తప్పదు. రామాయణ మహాభారతాలు ఊహాజనితాలంటూ 7వ తరగతి విద్యార్థులకు బోధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ కర్ణాటక కాన్వెంట్ స్కూల్ టీచర్ పై తాజాగా వేటు పడింది. హిందూత్వ వాదం బలంగా వినిపించే ఈ రాష్ట్రంలో టీచర్ అంశం హాట్ టాపిక్ అయింది.

మంగళూరులోని సెయింట్ జెరోసా ఇంగ్లిష్ హెచ్ఆర్ ప్రైమరీ స్కూల్లో ఈ ఘటన జరిగింది. రాముడు కల్పితమంటూ ప్రైమరీ స్కూలు విద్యార్థులకు టీచర్ బోధించిందంటూ ఓ వర్గం నిరసనకు దిగింది. పిల్లల ముందు గోద్రా అల్లర్లు, బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసును ప్రస్తావిస్తూ ప్రధాని మోడీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిందని వారు ఆరోపించారు.

టీచర్ ను తొలగించాలంటూ శనివారం నిరసనకు దిగారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే వేద్యాస్ కామత్ కూడా వారికి మద్దతు పలికారు. ''ఇలాంటి టీచర్కు మీరు మద్దతు ఇస్తారా? మీ నైతికత ఏమైంది? టీచర్ను ఇంకా ఎందుకు విధుల్లో కొనసాగనిస్తున్నారు? మీ సిస్టర్లు హిందూ పిల్లలకు బొట్టు పెట్టుకోవద్దని, పూలు పెట్టుకోవద్దని చెబుతున్నారు. మీ నమ్మకాలను ఇలా అవమానపరిస్తే మీరు ఊరుకుంటారా?'' అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్ స్టిట్యూషన్ దర్యాప్తు ప్రారంభించారు. టీచర్ తీరుపై మంగళూరులో నిరసనలు వ్యక్తం కావడంతో స్కూలు యాజమాన్యం ఆమెను విధుల నుంచి డిస్మిస్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story