EPFO : ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ గుడ్ న్యూస్

EPFO : ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ గుడ్ న్యూస్

ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ గుడ్ న్యూ్స్ చెప్పింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీరేటును పెంచింది. ఈ మేరకు శనివారం జరిగిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్‌వో వర్గాలు వెల్లడించాయి. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు.

ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ 6 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. గత మూడేళ్లలో ఇదే అత్యధికం కావడంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ.

గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఇది 8.15 శాతంగా ఉంటే, అంతకుముందు ఆర్థిక ఏడాది (2021-22) 8.10 శాతంగానే ఉన్నది. దీంతో గత మూడేండ్లలో ఇదే అత్యధిక వడ్డీ రేటుగా నిలిచింది.

గత పదేళ్లలో ఈపీఎఫ్‌ (EPF) వడ్డీ రేట్లు ఇలా

2013-14 : 8.75 శాతం

2014-15 : 8.75 శాతం

2015-16 : 8.8 శాతం

2016-17 : 8.65 శాతం

2017-18 : 8.55 శాతం

2018-19 : 8.65 శాతం

2019-20 : 8.5 శాతం

2020-21 : 8.5 శాతం

2021-22 : 8.1 శాతం

2022-23 : 8.15 శాతం

Tags

Read MoreRead Less
Next Story