ఏపీలో మరోసారి పదివేల మార్కుదాటిన కరోనా కేసులు

ఏపీలో మరోసారి పదివేల మార్కుదాటిన కరోనా కేసులు
ఇటీవల ఏపీలో కరోనా కేసులు సంఖ్య తగ్గుతున్నట్టు కనిపించింది.

ఇటీవల ఏపీలో కరోనా కేసులు సంఖ్య తగ్గుతున్నట్టు కనిపించింది. అయితే, గత నాలుగు రోజులు నుంచి మళ్లీ విజృంభిస్తుంది. ఈ రోజు మరోసారి పదివేల మార్కును దాటింది. గడిచిన 24 గంటల్లో 10,830 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదై కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 3,82,469కి చేరాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 2,86,720 మంది కోలుకోగా.. ప్రస్తుతం 92,208 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 81 మందిని కరోనా బలి తీసుకోగా.. ఇప్పటివరకు కరోనాతో 3,541 మంది మృతి చెందారు.

Tags

Read MoreRead Less
Next Story