ఏపీ విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్
By - Admin |24 Aug 2020 1:55 PM GMT
కరోనా మహమ్మారి ఏపీలో తీవ్రంగా విజృంభింస్తుంది. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు.
కరోనా మహమ్మారి ఏపీలో తీవ్రంగా విజృంభింస్తుంది. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఏపీలో ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. తాజాగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్కు కరోనా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని ఆయన తన వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలిపారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో పరీక్షలు చేపించుకున్నానని ఆయన తెలిపారు. ఈ పరీక్షల్లో పరీక్షల్లో పాజిటివ్గా తేలిందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ జాబితా పెద్దదే. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com