షాకింగ్ సంఘటన: రోజుల తరబడి ఆకలితో పచ్చి పిల్లి మాంసం తింటూ..

షాకింగ్ సంఘటన: రోజుల తరబడి ఆకలితో పచ్చి పిల్లి మాంసం తింటూ..
కుట్టిపురం బస్టాండ్ వద్ద జరిగిన షాకింగ్ సంఘటనలో, ఒక వ్యక్తి పిల్లి యొక్క పచ్చి భాగాలను తింటూ దొరికిపోయాడు.

కుట్టిపురం బస్టాండ్ వద్ద జరిగిన షాకింగ్ సంఘటనలో, ఒక వ్యక్తి పిల్లి యొక్క పచ్చి భాగాలను తింటూ దొరికిపోయాడు. అస్సాంలోని ధుబ్రీ జిల్లాకు చెందిన అతడు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని తాలూకా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక పరీక్ష తర్వాత అతడిని కోజికోడ్ ప్రభుత్వ మానసిక ఆసుపత్రికి తరలించారు.

అతడు పచ్చి పిల్లి మాంసం తినడం చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే మలప్పురంలోని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడి వద్దకు చేరుకుని విచారించగా, నాలుగు రోజులుగా తాను భోజనం చేయడం లేదని చెప్పాడు. ఆకలికి తాళలేక ఇలా పచ్చి పిల్లి మాంసం తింటున్నానని చెప్పాడు. దాంతో చలించి పోయిన పోలీసులు అతనికి ఆహారం అందించారు. అతడిని దేబోజిత్ రాయ్‌గా గుర్తించారు. సాయంత్రం 5 గంటల సమయంలో జరిగిన ఈ సంఘటన, అతడు తింటున్న ప్యాక్ నుండి దుర్వాసన రావడంతో సమీపంలోని దుకాణదారులు అతడిపై దృష్టి సారించారు.

విచారణలో, తన సోదరుడు నివసించే చెన్నై నుండి కోజికోడ్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. రెండేళ్ల క్రితం తన సొంత రాష్ట్రాన్ని వదిలి కేరళ చేరుకున్నాడని సీనియర్ పోలీసు తెలిపారు. "పోలీసులు అతని సోదరుడిని చెన్నైలో గుర్తించారు. అతడితో మాట్లాడితే.. కొన్ని సంవత్సరాల క్రితమే తన తమ్ముడు దేబోజిత్ రాయ్ తప్పిపోయాడని చెప్పాడు. రాయ్ మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని సోదరుడు తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story