బ్రేకింగ్.. రాజ్యసభకు సుధామూర్తి... మోదీ శుభాకాంక్షలు

బ్రేకింగ్..  రాజ్యసభకు సుధామూర్తి... మోదీ  శుభాకాంక్షలు

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మేరకు ట్వీట్ చేసిన మోదీ.. 'సామాజిక సేవ, విద్య సహా పలు అంశాల్లో ఆమె స్ఫూర్తిదాయక ముద్ర వేశారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆమె రాజ్యసభలో ఉండటం నారీశక్తికి నిదర్శనం. తన బాధ్యతను సుధామూర్తి పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తారని ఆశిస్తున్నా' అని ఆకాంక్షించారు.

ఒక ఉపాధ్యాయురాలుగా ప్రస్థానం ప్రారంభించిన సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ఆమె భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు. సుధా మూర్తి రచయిత, దాతృత్వాన్ని నమ్ముతారు. 2006లో ఆమె చేసిన సామాజిక సేవకు గానూ ప్రభుత్వం భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. 2023లో ఆమెకు భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ కూడా లభించింది.

Tags

Read MoreRead Less
Next Story