Bridge Collapse : నిర్మాణంలో ఉండగా కూలిన బ్రిడ్జి.. శిథిలాల కింద 30 మంది

Bridge Collapse : నిర్మాణంలో ఉండగా కూలిన బ్రిడ్జి.. శిథిలాల కింద 30 మంది

నిర్మాణంలో అతివేగం.. అవినీతి.. నాణ్యత లోపించడం జనం ప్రాణాలు తీస్తున్నాయి. బీహార్‌లో (Bihar) ప్రమాదం సంభవించింది. సుపాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ భారీ వంతెన ఉన్నట్లుండి కుప్పకూలింది. ఈ సంఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరీచా దగ్గర భేజా-బకౌర్‌ మధ్య కోసీ నదిపై భారీ వంతెన నిర్మాణం చేపట్టారు అధికారులు.

శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో బ్రిడ్జిలోని ఒక భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే.. ఆ సమయంలో కొందరు కార్మికులు బ్రిడ్జిపై ఉన్నారనీ తెలుస్తోంది. ఉన్నట్లుండి బ్రిడ్జి కూలిపోవడంతో 30కిపైగా మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఒకరు చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. పలువురికి తీవ్రగాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ 9 మందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

బ్రిడ్జికి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ 2014లో శంకుస్థాపన చేశారు. 2019లోనే పనులు పూర్తవ్వాల్సి ఉండగా ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రూ.1700 కోట్లకు పైగా అంచనా వ్యయంతో బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. కోసి నదిపై భగల్‌పూర్, ఖగారియా జిల్లాలను కలిపేలా ఈ బ్రిడ్జిని అధికారులు నిర్మిస్తున్నారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని చూస్తున్నామనీ.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story