PM Modi : రాజ్యాంగాన్ని అంబేడ్కర్ కూడా మార్చలేరు: మోదీ

PM Modi : రాజ్యాంగాన్ని అంబేడ్కర్ కూడా మార్చలేరు: మోదీ

రాజ్యాంగంలో సవరణలు చేపట్టేందుకే బీజేపీ భారీ మెజార్టీని కోరుకుంటోందన్న ప్రతిపక్షాల విమర్శలకు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. NDA రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని.. అంబేడ్కర్ సైతం దానిని మార్చలేరన్నారు. నన్ను దూషించేందుకు ప్రతిపక్షాలు రాజ్యాంగం పేరును వాడుకుంటున్నాయి. అంబేడ్కర్, డా.రాజేంద్ర ప్రసాద్ తీర్చిదిద్దిన రాజ్యాంగమే నన్ను ప్రధానిని చేసింది. ప్రతిపక్షాలు రాజ్యాంగంతో రాజకీయాలు చేస్తున్నాయని మోదీ విమర్శించారు.

ఇక బిహార్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని దూషించే వాళ్లు ఒక్క విషయం తెలుసుకోవాలి. రాజ్యాంగ రూపకర్తల్లో 80-90% మంది సనాతన ధర్మాన్ని గౌరవించిన వారే ఉన్నారు. ఈ గొప్ప రాజ్యాంగాన్ని అంబేడ్కర్ తీర్చిదిద్దేందుకు వీరు మద్దతుగా నిలిచారు. దేశాభివృద్ధికై కలలు కని రూపకర్తలు రాజ్యాంగాన్ని అందిస్తే కాంగ్రెస్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయిందని తెలిపారు

Tags

Read MoreRead Less
Next Story