Good News : రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. 48 స్పెషల్ రైళ్లు
వేసవి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు 48 స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు సికింద్రాబాద్-నాగర్సోల్ (07517), నాగర్సోల్-సికింద్రాబాద్ (07518), తిరుపతి-మచిలీపట్నం (07121), మచిలీపట్నం-తిరుపతి (07122), CST ముంబై-కరీంనగర్ (01067), కరీంనగర్-CST ముంబై (01068), యశ్వంత్పూర్-కాలాబుర్గి(06505), కాలాబుర్గి-యశ్వంత్పూర్ (06506) మధ్య నడుస్తాయని తెలిపింది.
మరోవైపు తిరుపతి రూట్ లో నడుస్తున్న పలు రైళ్లను ఈ నెల16 నుంచి 23 వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు, 19న మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రోజూ చెన్నై సబర్బన్ టెర్మినల్– తిరుపతి, తిరుపతి–-అరక్కోణం-–తిరుపతి, చెన్నై సెంట్రల్– తిరుపతి–చెన్సై సెంట్రల్, విల్లుపురం–తిరుపతి–-విల్లుపురం స్టేషన్ల మధ్య నడిచే ఈ రైళ్లను తిరుచనూర్– -తిరుపతి, కాట్పాడి-– తిరుపతి స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు చేశారు.
అలాగే రామేశ్వరం– -ఓకా మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలును కాట్పాడి, పాకాలా, ధర్మవరం, గుత్తి స్టేషన్ల మీదుగా మళ్లించారు. హజరత్ నిజాముద్దీన్- – తిరువనంతపురం ఎక్స్ప్రెస్ కాట్పాడి, అరక్కోణం, రేణిగుంట మీదుగా, మంగుళూరు సెంట్రల్– సంత్రగచ్చి, ఎస్ఎంవీటీ బెంగుళూరు-– టాటానగర్ఎక్స్ప్రెస్, ఎస్ఎంవీటీ బెంగుళూరు-– హతియా ఎక్స్ప్రెస్, హజరత్నిజాముద్దీన్– ఎర్నాకులం మార్గంలో నడిచే ఎక్స్ప్రెస్లను కాట్పాడి, అరక్కోణం, రేణిగుంట మీదుగా దారి మళ్లించి నడుపుతున్నారు. దారి మళ్లింపు ఈనెల16 నుంచి23 వరకు కొనసాగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com