Delhi : కేజ్రీవాల్ అంటే మోదీకి భయం : సంజయ్ రౌత్

Delhi : కేజ్రీవాల్ అంటే  మోదీకి భయం :  సంజయ్ రౌత్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ను (Arvind Kejriwal) చూసి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) భయపడుతున్నారని శివ సేన యూబీటీ నేత సంజయ్ రౌత్ అన్నారు. అందుకే ఆయన్ను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అయినా జైలు నుంచే కేజ్రివాల్ పాలన సాగిస్తున్నారని.. దీంతో ఇప్పుడాయన మరింత ప్రమాదకరంగా మారాడని చెప్పారు. ప్రజలు కూడా కేజ్రివాల్ మాట వింటారని ఆయనకు మద్దతుగా నిలబడతారని అన్నారు. స్వాతంత్య్రపోరాటంలో కూడా జైలుకు వెళ్లిన నాయకులు మరింత బలంగా తిరిగొచ్చారని చెప్పారు. రాజకీయ నాయకులను భయపెట్టేందుకు, ప్రతిపక్షాలను నిర్మూలించేందుకు మోదీ దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ నెల 31న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగే ఇండియా కూటమి ర్యాలీకి తమ పార్టీ నేతలు కూడా హాజరవుతారని సంజయ్ రౌత్ తెలిపారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడి అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story