Kavitha : జడ్జిగారు.. మీరే చూడండి.. కవిత జైలు ఘోష

Kavitha : జడ్జిగారు.. మీరే చూడండి.. కవిత జైలు ఘోష

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) తిహార్ జైల్ లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈడీ అధికారులు ఆమె రిమాండ్ ముగియగానే మరోసారి కస్టడీ కోరనున్నారు. ఈడీ కస్టడీ పలుమార్లు పొడిగించిన తర్వాత.. ఇటీవల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈడీ అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులోనే ఉన్నారు. ఆమెకు కొన్ని సౌకర్యాలు కల్పించింది కోర్టు.

ఐతే.. జైలులో తనకు కొన్ని వసతులు కల్పించాలని రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దాంతో.. స్పందించిన న్యాయస్థానం కూడా అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కవిత విజ్ఞప్తి మేరకు రోజూవారీ ఉపయోగించే దుస్తులు తీసుకోవడం, కొన్ని ఆభరణాలు ధరించడంతో పాటు సొంతంగా భోజనం ఏర్పాటు చేసుకోవడం, సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం, దుప్పట్లు తెచ్చుకోవడం, చెప్పులు వేసుకోవడం వంటి వెసులుబాట్లు కల్పించింది కోర్టు. తీహార్‌ జైలుకు తరలించకముందే కవితకు ప్రత్యేక కోర్టు ఈ వెసులుబాట్లు కల్పించించింది.

ఈ వసతులను తీహార్‌ జైలు అధికారులు కల్పించడం లేదని ఎమ్మెల్సీ కవిత తరఫు న్యాయవాదులు ప్రత్యేక కోర్టుకు ఫిర్యాదు చేశారు. కనీసం రోజువారీ ఉపయోగించే దుస్తులను కూడా అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. రౌస్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా దీన్ని పరిశీలించారు. దాంతో.. స్పందించిన న్యాయస్థానం జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ముందే ఉత్తర్వులు ఇచ్చిందనీ.. కానీ ఎందుకు వాటిని అమలు చేయడం లేదో చెప్పాలని ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story