Modi : దేశ ప్రజలకు మోదీ బహిరంగ లేఖ
నేడు పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ను ఈసీ (EC) ప్రకటించనున్న వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ రాశారు. ‘నా కుటుంబ సభ్యులారా’ అని ప్రజలనుద్దేశించి.. ‘వీక్షిత్ భారత్’ నిర్మాణంలో మద్దతు కావాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో విజయంపై ధీమాను వ్యక్తం చేస్తూ మరోసారి కలిసి పనిచేస్తామని అన్నారు. గత పదేళ్లలో ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను హైలెట్ చేస్తూ, ప్రజల సలహాలను కోరారు. ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయాల్లో ప్రజల మద్దతు అపారమైన శక్తిని ఇచ్చిందని పేర్కొన్నారు.
నేడు పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో షెడ్యూల్ను వెల్లడించనుంది. దీంతో పాటు ఏపీ, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ షెడ్యూల్ను ప్రకటించే అవకాశముంది. గత లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు విడతల్లో జరిగాయి. ఫలితాలు మే 23న వెలువడ్డాయి. కాగా షెడ్యూల్ ప్రకటన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com