PM Modi : ఇయ్యాల గుజరాత్ లో ప్రధాని మోదీ పర్యటన

PM Modi : ఇయ్యాల గుజరాత్ లో  ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోదీ (PM Modi) గుజరాత్ (Gujarat), ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో ఫిబ్రవరి 22, 23 తేదీల్లో పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాల్లో రూ.61వేల కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు /శంకుస్థాపనలు చేయనున్నారు. బుధవారం ఈ

మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ఓప్రకటనను జారీ చేసింది. గుజరాత్ లోరూ.48 వేల కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజె క్టులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

వారణాసి దాని పరిసర ప్రాంతాలను మార్చ డానికి రూ. 13 వేల కోట్ల విలువైన పనులను ప్రారంభిస్తారు. గురువారం మోదీ అహ్మ దాబాద్ లో గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎమ్ ఎమ్ ఎఫ్) గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. కాక్ర పార్ అటామిక్ పవర్ స్టేషన్ లో కొత్తగా నిర్మించిన రెండు హెవీ వాటర్ రియాక్టర్స్ ను జాతికి అంకితం చేస్తారు.

శుక్రవారం వారణాసిలోని బనారస్ హిందూ యూని వర్సిటీలోని స్వతంత్ర సభాగర్లో సంసద్ సంస్కృత ప్రతియోగిత విజేతలకు బహుమ తులను పంపిణీ చేసే కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. సంత్ గురు రవిదాసజన్మస్థ లిని దర్శించుకుని, పూజలు నిర్వహిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story