PM Modi : నా కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు : మోదీ

PM Modi : నా కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు : మోదీ

శ్రీరాముడు భారతీయుల హృదయాలలో ఉన్నాడని PM మోదీ ట్వీట్ చేశారు. అయోధ్యలో తొలిసారి నిర్వహించుకుంటున్న రామనవమి పర్వదినాన ఆలయ నిర్మాణం కోసం ప్రాణాలు అర్పించిన సాధువులు, రామ భక్తులు, మహాత్ములను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న తన కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠను వీక్షించిన క్షణాలు తన మదిలో ఇంకా శక్తిని నింపుతున్నాయని పేర్కొన్నారు.

శ్రీరామ నవమి సందర్భంగా ఇవ్వాల మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యలో అరుదైన ఘట్టం జరగనుంది. బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం ఆవిష్కృతం కానుంది. 75MM వ్యాసార్ధంతో దాదాపు 6 నిమిషాలపాటు సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ప్రక్రియను నిన్న నిర్వాహకులు విజయవంతగా పరీక్షించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA), సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI) ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశాయి. ఈ అపురూప ఘట్టాన్ని భక్తులు వీక్షించేందుకు ఆలయ ప్రాంగణంలో దాదాపు 100 LED స్క్రీన్లను ఏర్పాటు చేశారట.

Tags

Read MoreRead Less
Next Story