PM Modi : కజిరంగ పార్క్‌లో మోడీ.. ఏనుగెక్కిన ప్రధాని

PM Modi : కజిరంగ పార్క్‌లో మోడీ.. ఏనుగెక్కిన ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏనుగు ఎక్కి సఫారీ చేశారు. శనివారం అస్సాంలో పర్యటిస్తున్న ప్రధాని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కజిరంగ జాతీయ పార్క్ ను సందర్శించారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం మోడీ అస్సాంలోని తేజ్ పూర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక ఛాపర్లో గోలాఘాట్ జిల్లాలోని కజిరంగకు వచ్చారు. నిన్న రాత్రి జాతీయ పార్క్లోనే సేదతీరిన ఆయన.. ఈ తెల్లవారుజామున అభయారణ్యంలోని సెంట్రల్ కొహోరా రేజ్ ను సందర్శించారు. తొలుత ఏనుగు ఎక్కి విహరించిన ప్రధాని.. ఆ తర్వాత జీపులో సఫారీ చేశారు. సఫారీ అనంతరం ఏనుగులకు చెరకు గడలను తినిపించారు.

ఈ అరణ్యంలోని ప్రకృతి అందాలను, జంతువుల చిత్రాలను ఆయన తన ప్రధానమంత్రి వెంట పార్క్ డైరెక్టర్ సొనాలీ ఘోష్, అటవీశాఖ సీనియర్ అధికారులున్నారు. ఈ సందర్భంగా మహిళా ఫారెస్ట్ గార్డులతో ఆయన ముచ్చటించారు. ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ప్రధాని. ప్రతి ఒక్కరూ కజిరంగ నేషనల్ పార్క్ ను సందర్శించి ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించాలని కోరారు.

జోర్హాట్ లో కమాండర్ లచిత్ బర్ఫుకాన్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. 125 అడుగుల ఎత్తులో శౌర్యానికి ప్రతీకగా ఈ విగ్రహం నిర్మించారు.

Tags

Read MoreRead Less
Next Story