BJP : కాషాయ గూటికి చేరిన రాధిక!

BJP : కాషాయ గూటికి చేరిన రాధిక!

ప్రముఖ నటుడు శేఖర్ సుమన్, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రతినిధి రాధిక జేర బీజేపీలో బీజేపీలో వేరారు. మంగళవారం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో వారిద్దరికీ ఆ పార్టీ నేత వినోద్ తాడ్వే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాధిక భేదా మాట్లాడుతూ ఆయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించిన అనంతరం కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో న్యాయయాత్ర చేస్తున్న సమయంలో పార్టీలోకి కీలక నేత సుశీల్ ఆనంద్ సుకే తనతో వ్యవహరించిన తీరును వివరించారు. ఈ అంశాన్ని పార్టీలోని సీనియర్ నేతలు నవీన్ ఫైలెట్, జైరం రమేశ్ దృష్టికి తీసుకు వెళ్లి ఫిర్యాదు చేశానని తెలిపారు. కానీ సుశీల్ ఆనంద్ పై వాళ్ళు ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆమె ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

అయోధ్యలోని రామమందిరాన్ని ఇటీవల రాధిక సందర్శించారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తనను లక్ష్యంగా చేసుకొందని రాధిక ఆరోపిస్తున్నారు. శేఖర్ సుమన్ బీజేపీలో చేరడంతో ఆయన రాజకీయాల్లో సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించినట్లు అయింది. 2009లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పాట్నా సాహెబ్ లోక్సభ స్థానం ముంచి పోటీ చేశారు. 2012లో శేఖర్ సుమన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story