Char Dham Yatra : ఛార్ ధామ్ యాత్రకు రెడీ అవుతున్నారా.. ఇదిగో అప్ డేట్

Char Dham Yatra : ఛార్ ధామ్ యాత్రకు రెడీ అవుతున్నారా.. ఇదిగో అప్ డేట్

గంగోత్రి ధామ్​ ఆలయ​ పోర్టల్స్ అక్షయ తృతియ సందర్భంగా 2024 మే 10 మధ్యాహ్నం 12:25 గంటలకు ఓపెన్​ అవుతాయి. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్​లోని ఉత్తరకాశీలో ఉన్న గంగోత్రి ఆలయ కమిటీ అధికారులు వెల్లడించారు. గంగా మాత శీతాకల నిడివి ప్రాంతమైన ఉత్తరకాశీలోని మూకాంబలో ఆలయ అర్చకులు కలిసి.. పోర్టల్స్​ని తెరిచే విషయంపై చర్చించారని శ్రీ పంచ్​ మందిర్​ సమితి గంగోత్రి ధామ్​కు చెందిన హరీశ్​ సెమ్వాల్​ తెలిపారు.

యమునోత్రి ధామ్​ పోర్టల్స్​ ఓపెనింగ్​పై ఈ నెల 14న.. సంబంధిత ఆలయ అర్చకులు ఓ నిర్ణయం తీసుకుంటారు. 14వ తేదీ ఆదివారం చైత్ర మాసంలో వచ్చే 6వ రోజు కావడం.. యమున.. భూమిపైకి వచ్చిందని నమ్ముతుండటం వల్లే.. ఆ రోజు అర్చకులు చర్చలు జరుపుతారని యమునోత్రి ఆలయ కమిటి ఎగ్జిక్యూటివ్​ సభ్యుడు పురుషోత్తమ్​ యూనియల్​ అన్నారు. బద్రినాథ్​ ధామ్​ పోర్టల్​.. మే 12 ఉదయం 6 గంటలకు ఓపెన్​ చేస్తారు. కేదార్​నాథ్​ పోర్టల్​.. మే 10 ఉదయం 7 గంటలకు ఓపెన్​ అవుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

సముద్రానికి 3140 మీటర్ల ఎత్తులో ఉంటుంది గంగోత్రి ధామ్​, సముద్రానికి 3,293 మీటర్ల ఎత్తులో యమునోత్రి ఉంటాయి. యేటా 6 నెలలపాటు ఛార్​దామ్​ ఆలయాలు మూతపడి ఉంటాయి. ఏప్రిల్​ లేదా మేలో తెరుచుకుని అక్టోబర్ లేదా నవంబర్ చలికాలంలో మూతపడతాయి. ఛార్​దామ్​ యాత్రకు గతేడాది రికార్డ్ స్థాయిలో 56లక్షల మంది భక్తులు సందర్శించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story