కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఆంధ్రులు మృతి
కర్ణాటకలోని చిక్బ బళ్లాపూర్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్లో వారు ప్రయాణిస్తున్న SUV ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసు అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. ఎస్యూవీ బాగేపల్లి నుంచి చిక్కబళ్లాపూర్కు వెళ్తుండగా, SUV డ్రైవర్ నిలిచి ఉన్న ట్యాంకర్ను ఢీకొట్టడంతో నలుగురు మహిళలు సహా 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వివరాల ప్రకారం బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి 44పై ఉదయం 7.15 గంటలకు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెంకొండ జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com