త్వరలో బిడ్డకు స్వాగతం పలుకనున్న.సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు
దివంగత పంజాబీ గాయకుడు శుభదీప్ సింగ్ సిద్ధూ, సిద్ధూ మూసేవాలాగా ప్రసిద్ది చెందారు. మూసేవాలా తల్లి చరణ్ కౌర్ గర్భవతి కావడంతో త్వరలో కొత్త ఇంటి సభ్యుడిని స్వాగతించేందుకు సిద్ధమవుతున్నట్లు కుటుంబ వర్గాలు ధృవీకరించాయి. 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాన్సా నుంచి కాంగ్రెస్ టిక్కెట్పై పోటీ చేసి విఫలమైన మూసేవాలా అదే ఏడాది మే 29న దారుణ హత్యకు గురయ్యారు.
రాబోయే బిడ్డకు సంబంధించి కుటుంబం ఇంకా అధికారిక ప్రకటనను విడుదల చేయనప్పటికీ, వారికి సన్నిహిత వర్గాలు మాత్రం త్వరలోనే డెలివరీ జరగనుందని ధృవీకరించాయి. ఇక మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ రాజకీయాల్లోకి ప్రవేశించి, బటిండా లోక్సభ స్థానం నుండి పోటీ చేయవచ్చని వచ్చిన పుకార్ల మధ్య అతను రాజకీయాలలోకి ప్రవేశించడం వారి పరిస్థితిని మార్చదని నొక్కిచెప్పారు.
అప్పట్లో ఖనౌరీ సరిహద్దులో హత్యకు గురైన రైతు శుభకరన్ సింగ్కు న్యాయం చేయాలని వాదిస్తూ, మూసేవాలా తల్లి చరణ్ కౌర్ రైతుల నిరసనలకు చురుకుగా మద్దతు పలికారు. ఆమె తన సందేశాలను విస్తరించడానికి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను ఉపయోగించుకుంది. మూసేవాలా, దీప్ సిద్ధూ, శుభకరన్ సింగ్ల ఫోటోలను కూడా పంచుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com