Supreme Court : సనాతన ధర్మం వ్యాఖ్యలపై మంత్రిని మందలించిన సుప్రీం

Supreme Court : సనాతన ధర్మం వ్యాఖ్యలపై మంత్రిని మందలించిన సుప్రీం

'సనాతన ధర్మాన్ని నిర్మూలించండి' అంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మందలించింది. వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడని ఆరోపించింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం స్టాలిన్‌కు తాను మంత్రినని, ఆయన వ్యాఖ్యలపై ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలుసుకోవాలని సూచించింది.

"మీరు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) కింద మీ హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. ఆర్టికల్ 25 ప్రకారం మీ హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టికల్ 32 (సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి) కింద మీ హక్కును వినియోగించుకుంటున్నారా? మీరు మాట్లాడిన మాటలకు పర్యవసానాలు తెలుసా? మీరు సామాన్యులు కాదు.. మీరు మంత్రి.. పరిణామాలు మీరే తెలుసుకోవాలి’’ అని ధర్మాసనం పేర్కొంటూ కేసును మార్చి 15కి వాయిదా వేసింది.

తమిళనాడులోని డీఎంకె ప్రభుత్వంలో మంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్, సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలతో తుఫాను సృష్టించారు. గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉద్యానిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలని, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల సాదృశ్యాన్ని ఉపయోగించి సనాతన ధర్మాన్ని దోమల వల్ల వచ్చే వ్యాధులతో పోల్చారు.

Tags

Read MoreRead Less
Next Story