PM Modi : ఇది సాధారణ ఎన్నికలు కాదు: మోదీ

PM Modi : ఇది సాధారణ ఎన్నికలు కాదు: మోదీ

లోక్‌సభ తొలి విడత ఎన్నికలకు సిద్ధమైన NDA కూటమి అభ్యర్థులకు ప్రధాని మోదీ నుంచి ప్రత్యేకంగా లేఖలు అందాయి. పేరు పేరునా నేతలను ఉద్దేశిస్తూ మోదీ నుంచి లేఖ రావడం అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలో కోయంబత్తూర్ బీజేపీ అభ్యర్థి అన్నామలై వంటి ప్రముఖులూ ఉన్నారు. మున్ముందు సంబంధిత అభ్యర్థులకు ప్రాంతీయ భాషల్లో లేఖ అందేలా కృషి చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

లోక్‌సభ తొలి విడత ఎన్నికలకు సిద్ధమైన బీజేపీ, NDA కూటమి అభ్యర్థులకు రాసిన లేఖలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సాధారణ ఎన్నికలు కాదని ఈ లేఖ ద్వారా ప్రజలకు తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కుటుంబాలు, ముఖ్యంగా పెద్దలు.. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో అనుభవించిన కష్టాలు ఇంకా మర్చిపోలేదన్నారు. గత పదేళ్లలో సమాజంలో ప్రతీ వర్గం బాగుపడిందని, మరోసారి గెలిస్తే మరింత బాగుచేయొచ్చని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story