Hardik Pandya : పాండ్యాకు మళ్లీ బిగ్ షాక్

Hardik Pandya : పాండ్యాకు మళ్లీ బిగ్ షాక్

ఈ ఏడాది హార్దిక్ పాండ్యాకు కలిసి రావడం లేదు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ పాండ్యాపై భారీ జరిమానా వేసింది బీసీసీఐ. పంజాబ్‌ మ్యాచ్‌ లో స్లో ఓవర్‌ రేటు నమోదు అయింది. ఈ తరుణంలో.. రూ.12 లక్షల జరిమానా వేసింది బీసీసీఐ.

పంజాబ్ వర్సెస్ ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. చివరికి తొమ్మిది పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 192 పరుగులు చేసింది. సూర్య కుమార్ అద్భుత హాఫ్ సెంచరీ తో రాణించాడు. దీంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది ముంబై.

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్… 14 రన్స్ చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. శశాంక్ సింగ్, ఆషుతోష్ శర్మ పంజాబ్ ను అదుపుకున్నారు. అశుతోష్ శర్మ చివరి వరకు ఆడి గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ చివరికి… ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఐతే.. మ్యాచ్ గెలిచినా స్లో ఓవర్ రేట్ తో హార్దిక్ పాండ్యాకు జరిమానా తప్పలేదు. మ్యాచ్ జరిగితే ఏదో ఒకలాగా హార్దిక్ పాండ్యా వార్తల్లో ఉంటూ వస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story