Ind vs Eng : ఇంగ్లండ్ తో ఐదో టెస్టు.. టీమిండియా జట్టు ఇదే
మార్చి 7 గురువారం నుంచి ధర్మశాలలో ఇంగ్లండ్తో (England) జరగనున్న ఐదవ టెస్టు మ్యాచ్ కు టీమిండియా (India) జట్టును బీసీసీఐ ప్రకటించింది. వైస్-కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తిరిగి జట్టులోకి రాగా తొలి టెస్టు తర్వాత గాయపడిన బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) చివరి టెస్టుకు కూడా దూరమయ్యాడు. కాగా ఇప్పటికే టీమిండియా 3-1తో సిరీస్ ను గెలుచుకుంది.
చివరి టెస్టులో నైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ఇంగ్లండ్ చూస్తుంది. కాగా ధర్మశాలలోజరిగే ఈ టెస్టు టీమిండియా స్పిన్నర్ అశ్విన్ కు (Ashwin), ఇంగ్లండ్ బ్యాటర్ బెయిర్ స్టో లకు (Bairstow) వందో టెస్టు కావడం కావడం విశేషం. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో రెండు వేర్వేరు ఆటగాళ్లు ఒకే మ్యాచ్ లో వందవ టెస్టు ఆటడం ఇది మూడోసారి మాత్రమే.
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ , రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (డబ్ల్యూకే), కెఎస్ భరత్ (డబ్ల్యుకె), దేవదత్ పడిక్కల్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా , అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com