Ind vs Eng : జేమ్స్ అండర్సన్.. సరికొత్త చరిత్ర

Ind vs Eng : జేమ్స్ అండర్సన్.. సరికొత్త చరిత్ర

ధర్మశాల క్రికెట్ స్టేడియం మరో హిస్టరీకి వేదికైంది. ఇంగ్లండ్ స్టార్ బౌలర్, నిప్పులు చిమ్మే బంతులతో గడగడలాడించే జేమ్స్ అండర్సన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది అభిమానులను సంపాదించుకున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల మైదానంలో ఇండియా vs ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌తో జేమ్స్ అండర్సన్ రికార్డు సృష్టించాడు.147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అండర్సన్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. ఏకంగా 700 వికెట్లు తీసిన తొలి పేస్ బౌలర్‌గా నిలిచారు. మొత్తం 187 టెస్టులు ఆడిన అండర్సన్ ఈ ఫీట్ సాధించారు. ధర్మశాల వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్‌ను ఔట్ చేయడంతో ఈ రికార్డు నమోదైంది.

శ్రీలంక ప్లేయర్ మురళీధరన్(800), ఆస్ట్రేలియా ప్లేయర్ షేన్ వార్న్(708) వికెట్లు తీసి మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. వీరిద్దరి తర్వాత స్థానం అండర్సన్ దే. తొలి ఇద్దరూ స్పిన్నర్లు. ఐతే.. పేసర్లలో 700 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అండర్సన్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఫాస్ట్ బౌలింగ్ తో పిచ్చెక్కించే అండర్సన్ ను ఎదుర్కొనేందుకు టీమిండియా ప్రత్యేకంగా ట్రెయిన్ అయి ఉంటుంది. ముఖ్యంగా టీమిండియాపై అనేక రికార్డులు తిరగరాసిన చరిత్ర అండర్సన్ కు ఉంది. ఐపీఎల్ లోనూ ఇరగదీసే అండర్సన్ కు.. మన దగ్గరా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే.

Tags

Read MoreRead Less
Next Story