Warangal : వరంగల్ శివారులో వృద్ధుడి దారుణ హత్య

Warangal : వరంగల్ శివారులో వృద్ధుడి దారుణ హత్య

వరంగల్ ​శివారులోని కోమటిపల్లి ఆలియ తండా సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు 70 ఏండ్ల వృద్ధుడిని బండరాయితో కొట్టి హత్య చేశారు. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం..మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెళ్లికి చెందిన గజెల్లి పోశం(70) సింగరేణిలో పని చేసి కొంతకాలం కింద పదవీ విరమణ పొందారు. పోశం, ఈయన భార్య లక్ష్మి చిన్నచిన్న విషయాలకే గొడవ పడేవారు. నాలుగు నెలల కింద ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరగ్గా లక్ష్మీ హైదరాబాద్​లోని వృద్ధాశ్రమంలో చేరతానని వెళ్లిపోయింది. అప్పటినుంచి పోశం హనుమకొండ కుమార్​పల్లిలో ఉండే తన కూతురు ఇంట్లో ఉంటున్నాడు. గత శనివారం రాత్రి పోశంకు ఫోన్​ రావడంతో మాట్లాడుకుంటూ వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. అతడి కూతురు ఫోన్​చేస్తే లిఫ్ట్ చేయలేదు. సోమవారం కోమటిపల్లి-దేవన్నపేట సమీపంలోని ఆలియ తండా టీ నగర్​ వద్ద పోశం చనిపోయి ఉన్నాడని సమాచారం రావడంతో కూతురు, కుటుంబసభ్యులు వెళ్లారు. చూడగా పోశం తల, కుడి చేయి, ముక్కుపై గాయాలున్నాయి. పక్కనే మద్యం సీసాలు కనిపించాయి. దీంతో పోశంకు మద్యం తాగించి రాయితో కొట్టి చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. పోశంకు తన తమ్ముడైన రాజేశంతో కొంతకాలంగా మాటలు లేవు. కానీ, పోశం ఇంటి నుంచి వెళ్లిపోయిన రోజు రాత్రి రాజేశం ఫోన్​ చేశాడని, అతడిపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి కూతురు దివ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు కేయూ పోలీసులు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story