TS : పోటీలో ఉన్న అభ్యర్థుల్లో నేనే నం.1 : ఎంపీ నామా నాగేశ్వరరావు

TS : పోటీలో ఉన్న అభ్యర్థుల్లో నేనే నం.1 :  ఎంపీ నామా నాగేశ్వరరావు

ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థుల్లో తానే నంబర్ వన్ అని బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ముది గొండలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ఎంపీగా ఖమ్మం జిల్లాను ఎంతో అభివృద్ధి చేశానని, దీనిపై బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాల ను అవలంభిస్తోందని ఆరోపించారు.

మరోసారి తనను ఎంపీగా ఆశీర్వది స్తే రైతులు, బడుగుబల హీనవర్గాల సమస్యలపై పార్లమెంట్ లోకొట్టాడు తానని, కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు తీసుకొస్తానని చెప్పారు. జూలూరుపాడు, అన్నపురెడ్డిపల్లి,చండ్రుగొండ మండల కేంద్రాల్లో నూ నామా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముదిగొండలో మాట్లాడుతున్న నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఫ్రీ బస్ తప్ప మరేదీ అమలు చేయలేదన్నారు.

ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ తాతా మధు, వైరా, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యేలు మదన్లాల్, మెచ్చా నాగేశ్వ రావు, తాటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, బొమ్మెర రామమూర్తి, లింగాల కమల్ రాజు, దుర్గ, తోట ధర్మారావు, ఎర్ర వెంకన్న, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story