TS : రూ. 71 కోట్ల విలువైన నగదు, మద్యం, ఉచిత వస్తువులు స్వాధీనం

TS : రూ. 71 కోట్ల విలువైన నగదు, మద్యం, ఉచిత వస్తువులు స్వాధీనం

తెలంగాణలో ఎన్నికల ముందస్తు పట్టుబడిన నగదు, బంగారం, మద్యం, ఉచితాలు రూ.71.73 కోట్లకు చేరాయని ఓ అధికారి తెలిపారు. గత నెలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా నగదు, విలువైన లోహం, మద్యం, ఇతర వస్తువులను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి.

కిందటి వారంలో రూ.25.67 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం, ఫ్రీబీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు, ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లు ఇప్పటివరకు రూ.29.31 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నాయి. అంతకుముందు ఏప్రిల్ 7తో ముగిసిన వారంలో రూ.12.35 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఇప్పటివరకు రూ.9.54 కోట్ల విలువైన 3.62 లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో వారం రోజుల వ్యవధిలో రూ.6.2 కోట్ల విలువైన మద్యం పట్టుబడింది. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.15.49 కోట్ల విలువైన డ్రగ్స్/ మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి, ఆభరణాల విలువ రూ.10.33 కోట్లు.

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన ల్యాప్‌టాప్‌లు, కుక్కర్లు, చీరలు వంటి వాటిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ రూ.7.04 కోట్లు. ఇకపోతే రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story