TS: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కోసం కేటీఆర్ ఎత్తుగడలు

TS: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కోసం కేటీఆర్ ఎత్తుగడలు

లోక్ సభ ఎన్నికలు, కంటోన్మెంట్, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక బీఆర్ఎస్ కు సవాల్ విసురుతున్నాయి. ఈ నెల 28న జరగబోయే మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలవడానికి బీఆర్ఎస్ గోవాలో క్యాంపులు ఏర్పాటు చేసింది. అక్కడున్న జడ్పీటీసీలు, ఎంపీటీసీల్లో 70 శాతం మంది బీఆర్‌ఎస్‌ వాళ్లే.

అధికారం పోవడంతో ఓట్లు వేస్తారో లేదో తెలియని పరిస్థితి. జాగ్రత్త చర్యల్లో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలందర్నీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గోవాకు తీసుకెళి, గత రెండు రోజుల నుంచి అక్కడే క్యాంపు రాజకీయాలు నడిపారు. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా మాజీ బీఆర్ఎస్ లీడర్ మన్నె జీవన్ రెడ్డిని అభ్యర్థిగా నిలిపారు. ఆయన మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి సమీప బంధువు. అధికారంలో ఉన్నప్పుడే నల్గొండ లోకల్ ఎమ్మెల్సీని చేజార్చుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు పాలమూరు లోకల్ బాడీ ఎమ్మెల్సీ గెలుచుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. అప్పట్లో నల్లగొండ జిల్లాలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలందరూ బీఆర్‌ఎస్‌ వారే ఉన్నప్పటికీ.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. అంటే కారు పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధుల్లో ఎక్కువ మంది హస్తానికి ఓటేశారన్నమాట. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 1,394 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓటర్లుగా ఉండగా, వీరిలో బీఆర్‌ఎస్‌కు 823, కాంగ్రెస్‌కు 396, బీజేపీకి 88, బీఎస్పీకి ఒకటి, సీపీఐకి 4, సీపీఐ(ఎం)కు ఇద్దరు, ఎంఐఎంకు ఆరుగురు ఓటర్లు ఉన్నారు. ఇండిపెండెంట్లు 13 మంది ఉన్నారు. లెక్కలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నా.. ఓటు ఎవరికి పడుతుందనేది మాత్రం డౌట్ గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story