TS : నేడు సంగారెడ్డిలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ

TS : నేడు సంగారెడ్డిలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనుంది. పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సభలో పాల్గొంటారు. ఇప్పటికే సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్, మెదక్ ఎంపీ స్థానాల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నారు. . కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి నేరుగా సుల్తాన్‌పూర్‌లోని బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ సభకు సుమారు లక్ష మందిని సమీకరించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.

మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. సభ జరిగే స్థలాన్ని పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికరణ్‌తో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పరిశీలించారు. సభ ఏర్పాట్లపై వారికి పలు సూచనలు చేశారు. కాగా మెదక్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు.

ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ బీజేపీ తమ అధికారం కాపాడుకోవటం కోసం రహస్య ఒప్పందం చేసుకున్నాయని, కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో బీజేపీకి ఓటు వేస్తే మళ్లీ మోసపోతామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు చేసేలా పోస్ట్ కార్డ్ ఉద్యమం ప్రారంభించామని, ⁠కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిన హామీలు గుర్తు వచ్చేలా రైతులు, యువకులు, మహిళలు, గొల్ల కురుమలు రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాయాలన్నారు

Tags

Read MoreRead Less
Next Story