TS : సీఎం రేవంత్ ఇంటిముందు డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన.. ఉద్రిక్తత

TS : సీఎం రేవంత్ ఇంటిముందు డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన.. ఉద్రిక్తత

డీఎస్సీ అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి బిగ్‌ షాక్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముందు ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముందు ధర్నా చేస్తున్నారు డీఎస్సీ-2008 బాధిత అభ్యర్థులు. వందల సంఖ్యలో ప్లకార్డులు పట్టుకుని నిలబడి శాంతియుత ధర్నా చేస్తున్నారు. తమకు ఏళ్లుగా అన్యాయం జరుగుతోందని.. రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని కోరుతున్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో సీఎం పర్సనల్ సెక్రటరీని కలిశారు 2008 డీఎస్సీ అభ్యర్థులు. ఫైల్ పై రివ్యూ చేసి రెండు రోజుల్లోగా సీఎం రేవంత్‌ రెడ్డికి పూర్తి నివేదిక అందిస్తామని సీఎం పర్సనల్ సెక్రటరీ హామీ ఇచ్చారు.

2008 అభ్యర్థులు.. 15 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. 2008 నుంచి బీఈడీ, డీఈడీ అభ్యర్థులకు టీచర్ నియామకాల్లో ఇచ్చిన వెయిటేజీ ఇష్యూ మొదలైంది. ట్రైబ్యునల్స్, హైకోర్టులు తీర్పు ఇచ్చాయి. జీవోలు విడుదలయ్యాయి. దీంతో.. ఎప్పటికప్పుడు ఆటంకాలతో ఈ నియామకాలు మాత్రం పూర్తికాలేదు.

Tags

Read MoreRead Less
Next Story