TS : డబ్బుకు, ధర్మానికి మధ్య ఎన్నిక ఇది.. ఈటల రాజేందర్ హాట్ కామెంట్

TS : డబ్బుకు, ధర్మానికి మధ్య ఎన్నిక ఇది.. ఈటల రాజేందర్ హాట్ కామెంట్

హైదరాబాద్ ఎల్బీనగర్ లో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్. "అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక శ్వేతపత్రం ప్రవేశపెట్టింది అంటే మా దగ్గర ఏమీ లేదు అని చెప్పకనే చెప్పారు. హామీలు ఇచ్చాము తప్ప అమలుచేయలేకపోతున్నాం అని తెల్లజెండా ఎత్తినట్లే. గత పదేళ్ళలో కేంద్రం తెలంగాణలో 10 లక్షల కోట్లు ఖర్చుపెట్టాము. మాప్రభుత్వాన్ని ఆదరిస్తే డబుల్ అంటే 20 లక్షల కోట్లు అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు." అని అన్నారు.

మల్కాజిగిరి ఎంపీ సీట్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు ఈటల రాజేందర్. "BRS కి ఓటు వేస్తే మోరీలో వేసినట్టే. కాంగ్రెస్ కి ఓటు వేస్తే గాడిదలకు గడ్డివేసి ఆవుకు పాలుపిండినట్టు. నాకుఓటు వేయడం అంటే మోదీ గారికి ఓటు వేయడం. రేపు జరగబోయే ఎన్నిక డబ్బుకు ధర్మానికి మధ్య జరుగుతుంది. ధర్మాన్ని కాపాడండి. పిలిస్తే పలికే నాలాంటి వాణ్ణి ఎన్నుకోండి. సమాజం సుభిక్షంగా ఉండేలా చూడమని ఆ పరమశివున్ని కోరుతున్న." అని చెప్పారు ఈటల రాజేందర్.

నరేంద్ర మోదీ గొప్ప లీడర్ అనీ.. దుకే దేశమంతా ఆయన్ని ప్రేమిస్తున్నారని ఈటల అన్నారు. అనుభవం, పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న లీడర్ నే మల్కాజిగిరి నుంచి ఎన్నుకోవాలని కోరారు ఈటల. గత పదేళ్ళలో కేంద్రం తెలంగాణలో 10 లక్షల కోట్లు ఖర్చుపెట్టిందనీ... తమ ప్రభుత్వాన్ని ఆదరిస్తే డబుల్ అంటే 20 లక్షల కోట్లు అందిస్తామని మోదీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు రాజేందర్.

Tags

Read MoreRead Less
Next Story