TS : కడియం, ఆరూరిలు పదవులు అనుభవించి మోసం చేశారు : కేటీఆర్

TS : కడియం, ఆరూరిలు  పదవులు అనుభవించి మోసం చేశారు : కేటీఆర్

కడియం శ్రీహరి, ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి తల్లిలాంటి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి బయటకు వెళ్లారని కేటీఆర్ విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కడియం శ్రీహరికి, ఆరూరి రమేషు తగిన గుణపాఠం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ను గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొల్లం సంపత్ కుమార్ గుప్తా, తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story