TS : ఇవాల్టి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర

TS : ఇవాల్టి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఉప్పల్, ఎల్బీ నగర్, నల్గొండ మీదుగా సాయంత్రం మిర్యాలగూడలో రోడ్ షో చేస్తారు, రాత్రి సూర్యాపేట రోడ్ షోలో ప్రసంగిస్తారు. మొత్తం 17 రోజులపాటు యాత్ర కొనసాగిస్తారు. మే 10 సిద్దిపేటలో బహిరంగసభతో ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు. కాగా రోజూ ఉదయం పొలం బాట, సాయంత్రం 2-3 ప్రాంతాల్లో రోడ్ షోలు ఉండనున్నాయి.

తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించిన తర్వాత కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభిస్తారు. బీఆర్ఎస్ నేతలు భారీ ర్యాలీగా వెళ్లనున్నారు. ఉప్పల్, ఎల్బీనగర్, చౌటుప్పల్, నల్గొండ, మాడుగులపల్లి మీదుగా మిర్యాలగూడ వెళ్లనున్న గులాబీ దళపతి సాయంత్రం అక్కడ రోడ్ షోలో ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు సూర్యాపేట రోడ్ షోలో పాల్గొంటారు.

మొత్తం 17 రోజుల పాటు 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారు. చివరి రోజైన మే పదో తేదీన సిరిసిల్లలో రోడ్​ షో, సిద్దిపేటలో బహిరంగసభ నిర్వహించి ముగిస్తారు.త

Tags

Read MoreRead Less
Next Story