TS : రేపు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం

TS : రేపు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధ్యక్షతన 2024 ఏప్రిల్ 18న తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జెడ్పీ ఛైర్మన్లు, కార్యవర్గ సభ్యులకు ఆహ్వానం అందింది. ఎంపీ అభ్యర్థులకు బి-ఫారాలను, ఎన్నికల ఖర్చు కోసం రూ.95 లక్షల చొప్పున చెక్కులను కేసీఆర్ అందజేస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర, ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై చర్చిస్తారు. రైతుల వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకోవాలని భారాస నిర్ణయించింది. దన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రజలకు మరింత చేరుకావాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కాంగ్రెస్ తెచ్చిన కరువుకు అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెల్లి వారి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి, వారికి భరోసానివ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.

Tags

Read MoreRead Less
Next Story