TS : కడియం, పల్లాలకు కేసీఆర్ కీలక బాధ్యతలు!

TS : కడియం, పల్లాలకు కేసీఆర్ కీలక బాధ్యతలు!

బీఆర్ఎస్ (BRS) శాసన సభా పక్ష నేతగా కడియం శ్రీహరికి అవకాశం ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు గులాబీ బాస్ కేసీఆర్ (KCR) ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో వివిధ అంశాల మీద కడియం మాట్లాడుతున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి ఆయనను శాసనసభాపక్ష నేతగా నియమిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మీద కుటుంబపార్టీ అన్న ముద్ర ఉంది. దీనికి తోడు అనారోగ్య కారణాలతో కొన్ని రోజులపా టు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవచ్చు.

గంటల తరబడి సభలో కూర్చోవడం.. మాట్లాడేందుకు ఆరోగ్య రీత్యాకు కేసీఆర్ కు సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఈ సారి కడియం శ్రీహరికి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు కేటీఆర్, హరీశ్ రావు కూడా సుముఖంగా ఉన్నారని సమాచారం. దీంతో కడియం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇక బీఆర్ఎ ల్పీ ఉపనేతగా పల్లా రాజేశ్వర్ రెడ్డి అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. ఇక కడియం శ్రీహరికి వివాదరహితుడిగా పేరుంది. సభలో సీనియర్ నాయకుడు కూడా.. తెలుగుదేశం, బీఆర్ఎస్ హయాంలో సుధీర్ఘ కాలం పాటు మంత్రిగా పనిచేశారు. అనేక అంశాల మీద ఆయనకు పట్టుంది.

ఏ అంశంపై మీదైనా సు ధీర్ఘంగా మాట్లాడగలరు. ఆయన వాదనా పటిమితో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టగలరని పార్టీ భావి స్తోంది. ఇక దీనికి తోడు కడియం శ్రీహరి దళితుడు కావడం కూడా ఓ అడ్వాంటేజ్ అందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story