TS : తెలంగాణలో కేటీఆర్ కామెంట్లపై రచ్చ

TS : తెలంగాణలో కేటీఆర్ కామెంట్లపై రచ్చ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో చేసిన ఒప్పుకోలు ప్రకటన సంచలనం రేపుతోంది. లక్షల మంది ఫోన్లను ట్యాప్ చేశారని యూట్యూబ్ చానళ్లలో ప్రచారం చేస్తున్నారని కానీ ఒకరిద్దరి మాత్రమే చేసి ఉంటారని ఆయన బుధవారం వ్యాఖ్యానించారు. గ్రేటర్ పరిధిలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు కేటీఆర్.

ఈ సభల్లో కేటీఆర్ (KTR) అసహనంగా కనిపించారు. సీఎం రేవంత్ పై (CM Revanth) పదేపదే అసభ్య పదజాలం వాడుతూ ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుకుంటే యూట్యూబ్‌లో మొరిగే కుక్కల దాకా.. ఓటుతోనే సమాధానం చెప్పాలని ప్రజల్ని కోరారు. కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థులనే కాకుండా.. ఓ మాఫియాలాగా వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి ఆస్తులు రాయించుకున్నారన్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

కొంత మంది హీరోయిన్ల ఫోన్లనూ ట్యాప్ చేశారని కూడా బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఈ వార్తలు సంచలనంగామారుతున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో కొంతమంది ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని.. ట్యాప్ చేయడమే పోలీసుల పని అని కేటీఆర్ అంగీకరించడం కీలకంగా మారింది. ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావుతో పాటు మరో ఇద్దరు పారిపోయారు. వారి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎస్ఐబీ పేరుతో నడిపిన ఫోన్ ట్యాపింగ్ బ్లాక్ మెయిలింగ్ మాఫియా లీడర్ ను పట్టే పనిలో రేవంత్ రెడ్డి సీరియస్ గా దృష్టిపెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story