TS : నేడు చేవెళ్లలో కేసీఆర్ భారీ బహిరంగ సభ

TS : నేడు చేవెళ్లలో కేసీఆర్ భారీ బహిరంగ సభ

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఇవాళ సాయంత్రం చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. దీనికి పార్టీ చీఫ్ కేసీఆర్ హాజరుకానున్నారు. ఇప్పటికే సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయగా.. పెద్దఎత్తున జనసమీకరణ చేసే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న కేసీఆర్.. ఇవాళ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

ఉమ్మడి జిల్లాలో తొలి ఎన్నికల ప్రచార బహిరంగ సభ కావడంతో పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభను సూపర్‌ సక్సెస్‌ చేసేందుకు భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. సభ ఏర్పాట్లను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం పరిశీలించారు. గులాబీ బాస్‌ రాకతో జిల్లాలో లోక్‌ సభ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కనున్నది.

మరోవైపు.. ఈనెల 16న సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తారు. సుల్తాన్‌పూర్ శివారులోని సింగూర్ చౌరస్తాలో భారీ బహిరంగ సభకు హాజరవుతారు బీఆర్ఎస్‌ అధినేత. మరోవైపు.. ఇప్పటికే పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశాలు.. విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తూ.. కార్యకర్తల్లో జోష్‌ నింపేందుకు ఓవైపు కేటీఆర్, మరోవైపు హరీష్‌రావు ప్రయత్నాలు సాగిస్తోన్న విషయం విదితమే.

Tags

Read MoreRead Less
Next Story