Ts : ఉద్యోగికి మల్కాజిగిరి ఎమ్మెల్యే ధమ్కీ.. కేసు నమోదు

Ts : ఉద్యోగికి మల్కాజిగిరి ఎమ్మెల్యే ధమ్కీ.. కేసు నమోదు

Hyderabad : హైదరాబాద్ అల్వాల్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోకి ఉద్యోగులను రానీయకుండా, డిప్యూటీ కమిషనర్‌ను బెదిరించినందుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, అతని మద్దతుదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్‌ఎంసీ అల్వాల్‌ సర్కిల్‌ కార్యాలయం వద్ద ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి హల్చల్ చేశారు. అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు ప్రయత్నించారు.

మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులు కార్యాలయానికి వచ్చి ప్రధాన తలుపులు మూసివేసి ఉద్యోగులను లోపలికి రానీయకుండా అడ్డుకున్నారని అల్వాల్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయ డిప్యూటీ కమిషనర్‌ వి.శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. సుమారు గంటపాటు వారు ఆయనను, ఆయన కార్యాలయ ఉద్యోగులను లోపలికి రానీయకుండా అడ్డుకోవడంతో.. కారు దిగి ఎమ్మెల్యే వద్దకు రిప్రజెంటేషన లెటర్ తీసుకోవడానికి వచ్చారు. "ఏం డీసీ గారూ, ఎక్కువ చేస్తున్నారూ, నా సంగతి తెలుసా, నీ అంతు చూస్తా, నేనెంటో చూపిస్తా" అని ఎమ్మెల్యే తమను బెదిరించారని ఫిర్యాదులో తెలిపారు అధికారులు.

ఇదే సమయంలో ఎమ్మెల్యే అనుచరులు రమేశ్, పరమేశ్యయ డీసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ప్రతీకారం తీర్చుకోవాలని బెదిరించారు. ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై ఐపీసీ సెక్షన్‌ 149, 186, 189, 341, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎంఎల్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు బల్దియా అధికారులు. MLRIT ఇంజినీరింగ్ కళాశాలలో చిన దామర చెరువును ఆక్రమించి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో కూల్చివేతలు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story