TS : బీఎస్పీకి నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్ ఎంపీ సీట్లు

TS : బీఎస్పీకి నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్ ఎంపీ సీట్లు

పొత్తులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ.. బీఎస్పీకి రెండు సీట్లు కేటాయించింది. నాగర్‌కర్నూల్‌తో పాటు హైదరాబాద్ ఎంపీ సీట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. బీఆర్ఎస్ ఇప్పటివరకు 11 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. చేవెళ్ల-కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్- కడియం కావ్య, మల్కాజిగిరి- లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్-ఆత్రం సక్కు, జహీరాబాద్-అనిల్ కుమార్, నిజామాబాద్- గోవర్ధన్, కరీంనగర్-వినోద్ కుమార్, పెద్దపల్లి- కొప్పుల ఈశ్వర్, మహబూబ్ నగర్-శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం-నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్-మాలోత్ కవిత. మరో ఆరు స్థానాల్లో ప్రకటించాల్సి ఉంది. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తులో భాగంగా నాగర్‌కర్నూల్ స్థానం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారని తెలుస్తో్ంది. ఇక హైదరాబాద్ నుంచి అభ్యర్థిపై సస్పెన్స్ నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story