TS : పదేండ్లు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

TS : పదేండ్లు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారు  :  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాష్ట్రంలో రాబోయే పదేండ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ నల్లగొండలో నిర్వహించిన రంజాన్ వేడుక ల్లో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడా రు. తామందరం రేవంత్ నాయకత్వంలో పనిచేస్తున్నామన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని హరీశ్ రావు, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ పైన మంత్రి ఫైర్ అయ్యారు. ఎన్ని కల్లో కాంగ్రెస్ 14 సీట్లు గెలవడం ఖాయమ న్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాద న్నారు. మహేశ్వర రెడ్డి చిట్ చాట్ లు బంద్ చేసుకోవాలని, తనపై, కాంగ్రెస్ ప్రభు త్వంపై ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవడం మానుకోవాలని సూచించారు. ఏక్ నాథ షిండే అనే పదం బీజేపీ సృష్టించింద న్నారు. మహారాష్ట్ర లో ఎన్సీపీ, శివసేనను వేరు చేసి సంతలో పశువులు కొన్నట్టు ఎమ్మెల్యేలు కొన్నారని మండిపడ్డారు. అది ఇక్కడ వర్తించదని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్లో పది గ్రూప్ లు ఉన్నాయా అంటూ మహేశ్వర రెడ్డి మాట్లాడడం తగదన్నారు.

బీజేపీ లో గ్రూప్ లు లేవా అని ప్రశ్నించారు. బండి సంజయ్ ని దింపి కిషన్ రెడ్డి ని ఎందుకు అధ్యక్షుడిని చేశారో తెల్వదా అని నిలదీశారు. కాంగ్రస్ భట్టి గ్రూప్ ఉందని అనడం కరెక్ట్ కాదన్నారు. దళితులను అడ్డం పెట్టుకొని పదేళ్లు ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. భట్టి అంటే మాకు అపారమైన గౌరవం ఉందన్నారు. ఆయన ప్ర తిపక్ష నేతగా ఉండటం ఇష్టం లేక నే కేసీఆర్ 13 మంది ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్టు కొన్నడని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story