TS : ఇవాళ తెలంగాణకు మోదీ.. షెడ్యూల్ ఇదే

TS : ఇవాళ తెలంగాణకు మోదీ.. షెడ్యూల్ ఇదే

ప్రధాని మోదీ (PM Modi) ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని టూర్ కు సంబంధించి షెడ్యూల్ ను బీజేపీ విడుదల చేసింది. సోమవారం ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు ఆదిలాబాద్లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో మోడీ పాల్గొంటారు. 11:15 గంటల నుంచి 12 గంటలవరకు పబ్లిక్ మీటింగ్ ప్రధాని మాట్లాడతారు. మధ్యాహ్నం తమిళనాడు వెళ్లి.. తిరిగి రాత్రికి హైదరాబాద్ చేరుకుని రాజ్ భవన్ లో బసచేస్తారు.

మంగళవారం సంగారెడ్డిలో ప్రధాని మోడీ పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు రాజభవన్ నుంచి బయలు దేరనున్న మోడీ.. 10:45 నుంచి 11:15 వరకు వివిధ అభివృద్ధికా ర్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. 11:30 నుంచి 12:15 వరకు బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగి స్తారు. తెలంగాణ పర్యటన తర్వాత ఒడిషాకు పీఎం మోడీ వెళ్లనున్నారు.

మొత్తం 15 వేల 718 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాప నలు చేయనున్నారు. ఆదిలాబాద్ లో 6,697 కోట్లు, సంగారెడ్డిలో 9.021 కోట్లు ప్రాజెక్టులు ఉన్నాయి. బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. లింగంపల్లి నుండి ఘట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ ట్రైనన్ను కూడా ప్రధానిమంగళవారం ప్రారంభిస్తారు. వీటితో పాటు ఎన్టీపీసీని ప్రారంభించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story