TS : ఇంత పనిచేశాడా..? రాధాకిషన్‌ రావుపై పోలీసుల కఠినమైన సెక్షన్లు

TS : ఇంత పనిచేశాడా..? రాధాకిషన్‌ రావుపై పోలీసుల కఠినమైన సెక్షన్లు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో (Phone Tapping Case) ఏ4, మాజీ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ రాధాకిషన్‌రావుపై (Radha Kishan Rao)... దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారనే అభియోగం నమోదు చేశారు పోలీసులు. కూకట్‌పల్లిలోని విజయనగర్‌ కాలనీకి చెందిన మునగపాటి సుదర్శన్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు. కూకట్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 52 ఏళ్ల వ్యాపారవేత్త సుదర్శన్‌కుమార్‌ తన స్నేహితులు ఎస్‌ఆర్‌ నగర్‌కు చెందిన ఎంవీ రాజు, సనత్‌నగర్‌కు చెందిన ఏవీకే విశ్వనాథ్‌రాజు రాజేశ్వరా కన్‌స్ట్రక్షన్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తనను సంప్రదించారని ఆరోపించారు. వారు సుదర్శన్ కుమార్‌కు తన పెట్టుబడిపై 10% లాభం ఇస్తానని హామీ ఇచ్చారు.

లావాదేవీల్లో తేడాలతో టాస్క్‌ఫోర్స్‌కు చెందిన అధికారులు సుదర్శన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని రెండు రోజులపాటు సికింద్రాబాద్‌లో నిర్బంధించారు. మాజీ డిసిపి రాధాకిషన్ రావుతో సహా పోలీసు సిబ్బంది తనపై రబ్బరు ప్యాడ్‌లతో దాడి చేశారని సుదర్శన్ కుమార్ ఆరోపించాడు, వారు ఫ్లాట్‌ను ఖాళీ చేయమని తనను బెదిరించారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని కూడా హెచ్చరించారు. తన భద్రతకు భయపడి, సుదర్శన్ కుమార్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ సేల్ డీడ్‌ను రద్దు చేయాలని నిర్ణయించుకున్నాడు.

దాడి, దోపిడీకి పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుదర్శన్ కుమార్ ఇప్పుడు అభ్యర్థించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌పై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు సెక్షన్ 364(A),347,324,109 IPC r/w 34 IPC కింద కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story