TS : దుబాయ్‌లో ఆగిన ప్రభాకర్ రావు.. అక్కడి నుంచే బీఆర్ఎస్ నేతలతో చర్చలు!

TS : దుబాయ్‌లో ఆగిన ప్రభాకర్ రావు.. అక్కడి నుంచే బీఆర్ఎస్ నేతలతో చర్చలు!

దేశమంతటా రచ్చ చేస్తోంది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం. ఈ మొత్తానికి ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావే కీలకంగా మారారు. ఆయన్నే ప్రధాన అక్యూజ్డ్ గా టాస్క్ ఫోర్స్ స్పెషల్ టీమ్ చేర్చింది. ఆయన ప్రదాన పాత్రధారే అయినా… కీలక సూత్రధారులు ఎవరనేది ప్రభాకర్ రావు నోరు విప్పితేనే బయటపడుతుందనేది విశ్లేషకుల అంచనా. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉండటం.. ఎక్కడున్నా పట్టుకొస్తా అని గతంలోనే రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడంతో బీఆర్ఎస్ నేతలు వణికిపోతున్నారు.

ప్రభాకర్ రావు అమెరికా నుండి వచ్చేస్తున్నారని, అప్రూవర్ గా మారారని వార్తలొచ్చాయి. ఐతే.. ఆయన దుబాయ్ లోనే ఆగిపోయారని, అక్కడే ఉండి బీఆర్ఎస్ నేతలకు టచ్ లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందుతోంది. ప్రభాకర్ రావు అప్రూవర్ గా మారకుండా బీఆర్ఎస్ నేతల ఒత్తిడి ఉందని… దుబాయ్ లో ఉండే బీఆర్ఎస్ నేతల అనుచరుల ఒత్తిడితోనే ఆయన అక్కడే ఆగిపోయారని పోలీసులు అనుమానిస్తున్నారు. దుబాయ్ లో ఉండి… ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో ప్రభాకర్ రావు ఉన్నారని నిఘా వర్గాల సమాచారం.

ప్రభాకర్ రావు అప్రూవర్ గా మారితే బీఆర్ఎస్ పార్టీ పెద్దలపై కూడా టెలిగ్రాఫ్ యాక్ట్ కు అవకాశం ఉంటుందని… ఇది సీరియస్ కేసుగా మారబోతుందని, అందుకే ప్రభాకర్ రావుపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారు. తమ ఫోన్లు ట్యాప్ చేశారని… డైరెక్టుగా కేటీఆర్ పేరును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేయటం, రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులోనూ ఆయన అన్ని విషయాలు ఒప్పుకోవటంతో.. కేసు గత ప్రభుత్వ పెద్దల వరకు వెళ్తుందా అన్న అనుమానలు మొదలయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story